కాకినాడ : గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పెళ్లి కలకలం సృష్టించింది. కాలేజీ నడుస్తున్న సమయంలో క్లాస్ రూమ్లోనే పెళ్లి చేసుకున్నారు మైనర్లు. క్లాస్ రూమ్ లోనే అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు అబ్బాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్లు వివాహం నవంబర్ 17న జరిగినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్గా మారాయి. వైరల్ అయిన వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచారు.
No comments:
Post a Comment