Thursday, 2 July 2026

*విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

*విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*
-------------------------------------------------------------------
*మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి*
-------------------------------------------------------------------
*కొణిజెర్ల మండలం పల్లిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్దులతో కలిసి మద్యాహ్న బోజనం చేసిన జిల్లా కలెక్టర్*
-------------------------------------------------------------------
ఖమ్మం, కొణిజర్ల, జూలై -02: ప్రభుత్వ విద్యా సంస్ధలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపెడతారనీ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.గురువారం వైరా నియోజకవర్గ పర్యటనలో భాగంగా కొణిజెర్ల మండలం పల్లిపాడు గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి, వంటగది నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ దివాకర టిఎస్ మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలకు వడ్డిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.భోజనం రుచిగా ఉందా, మెనూ ప్రకారం గుడ్డు, వెజిటబుల్ బిర్యానీ, పప్పు, సాంబారు అందిస్తున్నారా, ఆహారం పరిశుభ్రంగా తయారవుతోందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో కీలకమని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం వినియోగించాలని, ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేసి తాజా కూరగాయలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంచేందుకు తల్లిదండ్రులతో నిరంతరం సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజనం, మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ విద్యపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొణిజెర్ల తహసీల్దార్ అరుణ, వైరా మున్సిపల్ కమీషనర్ రామచందర్ రావు, ఎంఈవో చావా శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

*దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు : రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*

"క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో  టెండర్లు"
"తుది దశలో స్ధలాల సేక‌ర‌ణ‌"
"దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు"
"19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా వెయ్యి ఇళ్ల వ‌రకునిర్మాణం"
"మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి"

క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పట్టాలను గురువారం నాడు మంత్రి సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్ధానిక‌ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రతి పేద కుటుంబానికి ఇల్లు” అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ ప‌రిధిలోని  19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో చోట కనీసం 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం రెండో, మూడో విడతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 5500 వరకు ఇళ్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ ఎకరాకు రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు ఉన్నా కూడా ఆ భూముల విలువను పక్కనబెట్టి పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి వారి పేరిట పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు.ధూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందిస్తున్నామని, మిగిలిన పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసేలా పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించేందుకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
     పేదలను నగరాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలోకి తరలించి ఇళ్లు కట్టే విధానం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదని, వారి జీవనాధారాలకు దగ్గరగా, అదే నియోజకవర్గ పరిధిలోనే ఇళ్లు అందించడం ప్రభుత్వ కట్టుబాటు అని మంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే కేవలం రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తుందని, అది సాధ్యం కాకపోతే తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని విసిరిన సవాల్‌కు ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతల నుంచి స్పందన రాలేదని గుర్తుచేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో ప్రయోజనం లేదనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ మాత్రం అదే నిధులను పేదల గూడు కోసం వినియోగిస్తోందన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గుడిసెల్లేని తెలంగాణ లక్ష్యాన్ని సాధిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Wednesday, 1 July 2026

నిజామాబాద్ లో నకిలీ అక్రీడేషన్ కలకలం

కొత్త అక్రిడేషన్ కార్డుల పేరుతో కిలాడీ ప్లాన్.. 
కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ కార్డు తయారీ..!*
నిజామాబాద్ జిల్లాలో నఖీలీ అక్రెడిటేషన్ కార్డు కలకలం రేపింది.
ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి మరీ చెలామని చేసారు. దీంతో ఓ నకిలీ కార్డు తయారు చేసి ఓ నఖీలీ రిపోర్టర్ చలామని అవుతున్నారు. ఇటీవల కొన్ని రోజులు క్రితం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసింది.
*కొత్త కార్డులు జారీ..*
గతంలో జర్నిస్టులు అక్రెడిటేషన్ కలిగిన వారు సైతం వారి వివరాలను మరో సారి సరి చేసుకిని కొత్త కార్డులకు అప్లై చేసుకోనుటకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ప్రభుత్వం కొన్ని కఠిన మైన నిబంధనలతో కూడిన పక్కా ప్రణాళికతో జర్నలిస్టు లకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో ఓ చానల్ పేరుతో ఓ వ్యక్తి ఏకంగా జిల్లా కలెక్టర్ సంతాన్ని ఫోర్జరీ చేసి మరీ మండల స్థాయి కార్డును తయారుచేసిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది

36 గంటలు శ్రమ...5ఆపరేషన్లు.. ఒక పేషెంట్లకు ఊపిరిలుదిన ఉస్మానియా వైద్య బృందం

*డాక్టర్స్ డే నాడు ఉస్మానియా వైద్య బృందం అద్భుతం చేసి చూపారు....  36 గంటలపాటు శ్రమించి పేషంట్‌కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. 
సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్‌కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన రికార్డును సాధించారని పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం ఈ విజయాన్ని సాధించి వైద్య వృత్తికి మరింత ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.*

Tuesday, 30 June 2026

కబ్జాలపై వెంటనే చర్యలు తీసుకోండి : నవతరెడ్డి డిమాండ్

*కబ్జాదారుల గుప్పిట్లో 50 కోట్ల CMC(GHMC) బల్దియా భూమి!*

 *శేరిలింగంపల్లి చందానగర్‌లో 4 వేల గజాల  స్థలం ఆక్రమణ*

 *అడ్డగోలుగా ప్రహరీ కూల్చి ఆక్రమించిన CMC అధికారుల మొద్దునిద్ర*

 *బి ఆర్ ఎస్ ప్రభుత్యం హయాంలో మహిళా భవనం కు,ఫంక్షన్ హాల్ కోసం భూమి  కేటాయిస్తే  కాంగ్రెస్ ప్రభుత్యలో  కబ్జాదారుల పాలు*

 *కలెక్టర్ ఇచ్చిన అధికారిక పత్రంలు ఇచ్చిన  చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న సీఎంసీ యంత్రాంగం*

 *ప్రజాప్రతినిధి అండతో మున్సిపల్ అధికారుల తీరుపై మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ద్యాజం*

 *తక్షణమే ఉన్నతాధికారులు స్పందించకపోతే మహిళలతో కలిసి  న్యాయపోరాటం తప్పదని హెచ్చరిక*

*చందానగర్:*
మహిళమణుల  అవసరాల కోసం కేటాయించిన సుమారు 50 కోట్ల విలువైన CMC భూమి కబ్జాదారుల పాలవుతున్నా మున్సిపల్ అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. కాపాడాల్సిన అధికారులే ప్రజాప్రతినిధి అండతో కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చందానగర్ డివిజన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ బాగోతం మున్సిపల్ అధికారుల అంతులేని నిర్లక్ష్యానికి, అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. సొంత భూమిని రక్షించుకోవడంలో విఫలమైన అధికారుల తీరుపై చందానగర్ మాజీ కార్పొరేటర్, న్యాయవాది బొబ్బ నవతారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్,డిప్యూటీ కమిషనర్ కు,గత 2 సంవత్సరాలుగా పిర్యాదు చేస్తున్న పట్టించుకోవడం లేదు అని  ఉన్నతాధికారులకు ఈ రోజు  ఆమె ఘాటైన లిఖితపూర్వకంగా  ఫిర్యాదు చేశారు.చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 210లో సుమారు 4 వేల గజాల స్థలం ఉంది. దీని బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుంది. ఈ స్థలంలో మహిళా భవనం, మోడల్ మార్కెట్, ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2018 (మార్చి 7న), 2019 (మే 5న) ప్రొసీడింగ్స్ (LC1/3076/2016) ద్వారా మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించారు. దీని ప్రకారం 2019లోనే కార్పొరేషన్ అధికారులు ఆ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించి, గేటు కూడా ఏర్పాటు చేశారు. అయితే, కబ్జాదారులు 2022 ఆగస్టు 10న, 2024 ఫిబ్రవరి 9న దౌర్జన్యంగా ఆ ప్రహరీని కూల్చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక మున్సిపల్ అధికారులు చోద్యం చూశారే తప్ప చర్యలు తీసుకోలేదు.

స్థలం ఆక్రమణకు గురవుతుండటంపై మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా.. అధికారులు అత్యంత బాధ్యతారాహిత్యంగా బదులిచ్చారు. అది మాది కాదు  ప్రభుత్వ భూమి అని, దానికి సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్వయంగా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలను జతచేసి.. 2024లో అప్పటి డెప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. 2025 నవంబర్‌లో సైతం జోనల్ కమిషనర్‌కు మరోసారి వినతిపత్రం ఇచ్చారు. అయినా ఉన్నతాధికారుల్లో ఉలుకూ పలుకూ లేదు.మున్సిపల్ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకున్న కొందరు, అదే స్థలంలో టీజీఎస్పీడీసీఎల్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి తెరతీశారు. దీనిపై నవతారెడ్డి ఆర్టీఐ ద్వారా విద్యుత్ శాఖను వివరణ కోరగా.. ఆ భూమికి సంబంధించి తమ వద్ద ఎలాంటి అధికారిక కేటాయింపు పత్రాలు లేవని,ప్రజాప్రతినిధుల సూచనతో నిర్మాణం చేశామని  సమాధానమిచ్చారు. ఇదే విషయమై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీయగా.. తాము విద్యుత్ శాఖకు  హెచ్ఎంసీ యాక్ట్ యూ బై ఎస్  635 కింద నోటీసులు ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. కోట్లాది రూపాయల భూమిని ఆక్రమించి,ఎలాంటి అనుమతులు లేకుండా స్థలంలో పత్రాలు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే నోటీసులు ఇచ్చి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా జీహెచ్ఎంసీ/సీఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారు. రూ.50 కోట్ల ప్రజా ధనాన్ని కబ్జాదారులకు ధారాదత్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రొసీడింగ్స్ ప్రకారం తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని, మహిళా భవనం, ఫంక్షన్ హాల్ నిర్మించాలి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి తక్షణమే అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మున్సిపల్ అధికారుల తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున మహిళ పోరాటం, న్యాయ పోరాటం చేస్తామని బొబ్బ నవతారెడ్డి హెచ్చరించారు.

ఆవేదన అంచుల నుండి ఆనందపు తీరాలకు.. ఇది ఓ నిహారిక కధ

కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేసుకున్నవి కావు… దేవుడు మన కోసం ముందే రాసిపెట్టినవి… ❤️🙏🏻

ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చూశాను…
అప్పుడప్పుడు నటించాను…
సినిమాల కోసం పని చేశాను…

కానీ ఈ రోజు…
సెన్సార్ బోర్డు మెంబర్‌గా నా మొదటి సినిమా చూసిన రోజు. 🎬

సినిమా పూర్తయ్యాక…
చర్చలు జరిగాయి…
సంతకాలు చేసి బయటికి వచ్చిన ఆ కొన్ని నిమిషాలు…
నా కాళ్లు ముందుకు నడుస్తున్నాయి…
కానీ నా మనసు మాత్రం ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయింది.

“అసలు ఇదంతా నేనేనా…?” అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను.

20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు…
చేతిలో ఏమీ లేదు…
Inter కూడా పూర్తి చేయలేక మధ్యలోనే ఆగిపోయాను.
ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు…
జీవితం నెట్టుకొస్తే చాలు…
అనుకున్న ఒక సాధారణ అమ్మాయి.

కానీ…
దేవుడు రాసిన కథ వేరేలా ఉంది.

రెండేళ్లకే అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను…
పెళ్లి తర్వాత ఇక సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్నాను…
కానీ జీవితానికి మన ప్లాన్ల కంటే దేవుడి ప్లాన్ ఎప్పుడూ గొప్పదే.

మళ్లీ సినిమాల్లోకి వచ్చాను…
పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పూర్తి చేశాను…
అమ్మ కలను నా కలగా మార్చుకొని Niharika Design Studio ప్రారంభించాను.
కరోనా సమయంలో మీ అందరి ప్రేమ, సహకారంతో  Foundation ద్వారా ఎంతోమంది జీవితాల్లో చిన్న వెలుగుగా నిలిచే అవకాశం వచ్చింది.

ఈ ప్రయాణంలో…
“ఇంకో అడుగు కూడా వేయలేను… నా వల్ల కాదు…”
అని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.

“ఇక బ్రతకడం ఎందుకు…”
అనే ఆలోచన కూడా ఎన్నోసార్లు వచ్చింది.

కానీ…
ఈ రోజు…
ఆ ఆలోచన కూడా నన్ను తాకలేని స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు.

అవును…
ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నాను…
కొన్నిసార్లు మళ్లీ బలహీనపడుతాను…
మళ్లీ లేస్తాను…

ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక విషయం బాగా తెలుసు…

దేవుడు ఆలస్యం చేయవచ్చు… కానీ మన జీవితంలో జరిగే ప్రతి మంచి విషయానికి సరైన సమయాన్నే ఎంచుకుంటాడు. ❤️

ఈ రోజు నాకు ఈ సినిమా ఇంకో కారణం వల్ల కూడా చాలా ప్రత్యేకం…

చిన్నప్పటి నుంచీ నేను ఎంతో అభిమానించే నా Real Hero సినిమా…
అదే సినిమాను సెన్సార్ బోర్డు మెంబర్‌గా చూసే అదృష్టం రావడం…
నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. 🎥✨

కొన్ని స్థానాలు…
కొన్ని అవకాశాలు…
మనమే వెతికి సంపాదించేవి కావు…

దేవుడు పిలిచి… “ఇది నీ సమయం” అని ఇచ్చేవి.

ఈ అవకాశం కూడా నాకు అలాంటిదే.

 ఈ నమ్మకం ఉంచి…
ఈ బాధ్యతకు నన్ను గుర్తించి, నా పేరును సూచించి, ఈ అవకాశం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻

భగవాన్… కామాక్షి అమ్మ…
మీ ప్రేమ…
మీ కృప…
మీ ఆశీర్వాదం లేకుండా నా జీవితంలో ఏదీ సాధ్యం కాదు.

Everything I am… Everything I have… is only because of Your unconditional love. ❤️🙏🏻

అంతా మీ కృప… మీ ఆశీర్వాదమే… 🙏🏻

#GratitudeAlways #BlessedJourney #CensorBoardMember #DivineGrace #DreamsDoComeTrue ❤️🙏🏻

Friday, 19 June 2026

*ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*


*ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

*ప్రతి ఓటరు వివరాలను సమగ్రంగా పరిశీలించాలి*

*ప్రతి ఇంటికి బీఎల్‌వో చేరుకొని పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి*

*డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి అభ్యంతరాలు, క్లెయిమ్‌లపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలి*

*రఘునాథపాలెం మండలం కేంద్రంలో ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమం ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
----------------------------------------------------------------
ఖమ్మం : ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కు ప్రజలందరూ తమ పూర్తి వివరాలతో స్వచ్చందంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.శుక్రవారం ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  కలెక్టర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతంగా చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో బీఎల్‌ఓల పని తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన ధృవీకరణ, సరైన డేటా నమోదు, పారదర్శకత తో పని చేయాలన్నారు. ఎస్ఐఆర్ లో భాగమైన మండలాలు, కార్పోరేషన్, మున్సిపాలిటీ సంబంధించి ప్రతి ఓటర్లను మ్యాపింగ్ చేసే విధంగా టార్గెట్ పెట్టుకొని వంద శాతానికి చేరుకోవాలన్నారు. 
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను జూన్ 24 నుంచి జులై 25 వరకు చేపట్టనున్నారన్నారు. డబుల్ ఓట్లు, మరణించిన ఓటర్ల వివరాలను ధృవీకరించి, తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. బదిలీ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను సక్రమంగా పరిశీలించి, రికార్డులను నవీకరించాలని తెలిపారు.
 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన లక్ష్యం, ఎన్నికల సిబ్బంది విధులు, పౌరుల భాగస్వామ్యం, ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై అవగాహన పెంచడం ద్వారా ప్రతి అర్హ పౌరుడు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావడానికి సహకరించాలని అధికారులు కృషి చేయాలన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చి, అనర్హులైన ఓటర్ల వివరాలను తొలగించే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, డబుల్ ఎంట్రీలతొలగింపు జరుగుతుందని తెలిపారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి అర్హమైన ఓటరుని గుర్తించి జాబితాలో చేర్చాలని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి బీఎల్‌వోకు ఎస్‌ఐఆర్‌ నిబంధనలు, విధి విధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ విధానం, ఫారాల నిర్వహణపై పూర్తి అవగాహన, పట్టు ఉండేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అన్నారు. వివరాలు, కావాల్సిన దృవీకరణలు బూత్ స్థాయి అధికారి సందర్శన సందర్భంగా సిద్ధం గా ఉంచాలన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ప్రజలందరూ సంపూర్ణంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------
*ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతం చేయాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి*
-------------------------------------------------------------------
ఖమ్మం : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈ ఆర్ ఓ లతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం, ఫారం పూర్తి చేసిన తర్వాత తిరిగి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తారని, పట్టణాలలో మ్యాపింగ్, అన్ మ్యాపింగ్ విభాగాలుగా సమాచారాన్ని విభజించి సవరణ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లకు సమావేశాలు నిర్వహించి సంబంధిత ఫోటోలు, మీటింగ్ మినిట్స్ నమోదు చేయాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలు స్థానిక భాషలో ముద్రించబడతాయని, బూత్ స్థాయి అధికారుల ద్వారా ఓటర్లకు అందజేయబడిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని సంబంధిత పోర్టల్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఈ ఆర్ ఓ లు క్షేత్రస్థాయిలో తరచుగా పర్యటించి సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించాలని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని, మ్యాపింగ్ చేయబడని ఓటర్ల వివరాలను అప్డేట్ ఆప్షన్ ద్వారా నమోదు చేయాలని తెలిపారు. జూలై 24వ తేదీ లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేయడం జరుగుతుందని, జూలై 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందని, జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, జూలై 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు అభ్యంతరాల పరిష్కరణ, అక్టోబర్ 1వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, మీటింగ్ మినిట్స్ నమోదు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 1 వేయి 200 మందికి మించి ఓటర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల సంబంధించిన బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని, బూత్ స్థాయి అధికారులకు వృద్ధ, అనారోగ్య, దివ్యాంగ ఓటర్ల నమోదు విషయంపై ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు. ఒకే కుటుంబం సంబంధించిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించాలని, తప్పుడు ప్రచారాన్ని నిరోధించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక  సమగ్ర సవరణ కార్యక్రమం పురస్కరించుకొని జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించామన్నారు. బూత్ స్థాయి అధికారులకు, బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై జిల్లాలో బ్యానర్లు, హోర్డింగ్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 
జిల్లాకు ప్రచార సామాగ్రి, బూత్ స్థాయి అధికారుల కిట్లు చేరినట్లు అన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల పూర్తి, ఏ ఏ దృవీకరణలు తీసుకోవాలో బూత్ స్థాయి అధికారులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం ఏ. రాజు, డిటి అన్సారీ, ఎన్నికల విభాగ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-------------------------------------------------------------------
Powered by : 
 MANIKUMAR KOMMAMURU
📲: 9032075966