Tuesday, 23 September 2025

*ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*



**కలెక్టరేట్ లో నిర్వహించిన బతుకమ్మ  వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దంపతులు*
ఖమ్మం : తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే బతుకమ్మ, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
మూడవ రోజు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,  అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలలో కలెక్టర్ సతీమణితో కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ  వేడుకలలో కలెక్టరేట్లోని వివిధ శాఖలలో ఉన్న మహిళలంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.... అంటూ ఆట, పాటలతో సందడి చేసిన మహిళలు, ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ కలిసి ఆడి వారిని ఉత్తేజపరిచారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకొంటూ, కలిసి కట్టుగా అందరూ ఒకేచోట చేరి ఆడుతూ, పాడుతూ బతుకమ్మను పూజించుకొంటారని అన్నారు.   
ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం విద్యార్థినులు, వైద్య శాఖ ఉద్యోగినులు, సిబ్బంది, అందరూ పాల్గొని గౌరమ్మను కొలిచి ఆట, పాటలతో సందడి చేసారు.

Sunday, 14 September 2025

మేడారానికి పోలీస్ బైక్ పై మంత్రి సీతక్క...

ములుగు జిల్లా మేడారం మహా జాతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరిష్,  మంత్రి సీతక్క  మేడారం పరిసర ప్రాంతాల్లో బైక్ పై పర్యటించి రహదారుల పరిస్థితిని పరిశీలించారు. 
🔸జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించేందుకు సూచనలు చేశారు.🔸అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ప్రత్యేక మార్గాలపై పోలీసు అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రముఖుల రాకపోకల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.🔸జాతర ప్రాంతంలో వాహనాల కదలిక, పార్కింగ్ సదుపాయాలు, అత్యవసర వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్ర ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. 


Monday, 8 September 2025

భాజపా రాష్ట్ర కోశాధికారిగా దేవకి వాసుదేవరావు.• అభినందించిన జిల్లా అధ్యక్షులు నెల్లూరు.


ఖమ్మం : భాలతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన కమిటీలో ఖమ్మం జిల్లా నాయకుడు దేవకి వాసుదేవరావుకి కీలక బాధ్యతలు లభించాయి. తాజాగా ప్రకటించిన జాబితాలో ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది.ఈ జాబితాలో ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ సందర్భంగా భాజపా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, దేవకి వాసుదేవరావును హృదయపూర్వకంగా అభినందించారు.ఖమ్మం జిల్లా నాయకుడిగా దేవకి వాసుదేవరావు రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టడం పార్టీ బలపడేందుకు తోడ్పడుతుందని భాజపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Tuesday, 2 September 2025

*విపత్తు నివారణ పనులపై సమగ్ర నివేదిక పంపండి..... సీఎం రేవంత్ రెడ్డి*


ఖమ్మం, సెప్టెంబర్-1: భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, విపత్తు నిర్వహణ నిధుల క్రింద చేపట్టిన పనులు వివరాలతో కూడిన సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.భారీ వర్షాలు, వరద నష్టం, సహాయంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దనసరి అనసూయ (సీతక్క), కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు లతో కలిసి, హైదరాబాద్ నుండి సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యలు పాల్గొన్నారు.*సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ* భారీ వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, కుంటల వివరాలు సేకరించాలని, వీటి మరమ్మత్తు, పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, వరదల సహాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న నేపథ్యంలో గత వరదల సమయంలో వినియోగించిన నిధులను పూర్తి స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ క్రింద జమ చేసి కేంద్రం నుంచి సహాయం రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల యూసీలను సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 720 కోట్ల విలువ గల 1009 కిలో మీటర్ల ఆర్ అండ్ బి రోడ్లు, 11 కోట్ల విలువ గల జాతీయ రహదారులు, 374 కోట్ల విలువ గల పంచాయతీరాజ్ రోడ్లు, 32 కోట్ల 73  లక్షల విలువ గల   విద్యుత్ శాఖ పరికరాలు దెబ్బతిన్నాయని అన్నారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలని సిఎం ఆదేశించారు.*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు మాట్లాడుతూ* ఆగస్టు 26 నుంచి 28 తేదీలలో భారీ వర్షాలు మన రాష్ట్రంలో కురిసాయని ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురువడంతో ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 4124 కోట్ల రూపాయల వరకు నష్టం సంభవించిందని అన్నారు. ఈ వీడియో సమావేశంలో డిఆర్ఓ  ఏ. పద్మశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఎస్ఈ ఇరిగేషన్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ఈ యాకోబు, సిపిఓ శ్రీనివాస్, ఎన్డీఆర్ఎఫ్,, విద్యుత్ శాఖ, పంచాయతీ రాజ్, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన సేవలకు రెవెన్యూ - రిజిస్ట్రేషన్ శాఖల అనుసంధానం: మంత్రి పొంగులేటి

పౌరులకు మెరుగైన మరియు పారదర్శక సేవలను అందించడానికి, తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ మరియు సర్వే విభాగాలను అనుసంధానించే ఏకీకృత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది - గౌరవనీయులైన రెవెన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార మరియు సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 📍: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. 🔹 భూ భారతి పోర్టల్‌తో సర్వే మ్యాప్‌లను అనుసంధానించడం 🔹 కోర్టు కేసు పర్యవేక్షణ వ్యవస్థ 🔹 గ్లిచ్-ఫ్రీ మరియు యూజర్ ఫ్రెండ్లీ భూభారతి పోర్టల్‌ను నిర్ధారించడం 🔹 5 పైలట్ గ్రామాలలో రీ-సర్వే పూర్తయింది 🔹 408 గ్రామాల్లో త్వరలో రీ-సర్వే ప్రారంభం కానుంది భవిష్యత్తులో తెలంగాణ అంతటా భూ వివాదాలను పరిష్కరించడానికి ఈ చొరవ మార్గదర్శక చట్రంగా పనిచేస్తుంది. రెవెన్యూ కార్యదర్శి శ్రీ డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ ఐ.జి., శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు, CCLA, కార్యదర్శి, శ్రీ మంద మకరంద్, NIC SIO శ్రీ ప్రసాద్, శ్రీ విజయ్ మోహన్; శ్రీ కృష్ణ, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.