Monday, 2 October 2023

"బాపు" మీడియకు భద్రత కల్పించండి అంటూ పాత్రికేయుల వేడుకోలు.. ప్రభుత్వాల వైఖరిపై నిరసన గళం...

*మీడియా కమీషన్ కోసం గళం విప్పిన జర్నలిస్టులు*
*మీడియకు భద్రత కల్పించాలని గాంధిజీకి మొరపెట్టుకున్నపాత్రికేయులు*
*టియుడబ్ల్యుజె ఐజెయు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా  నిరసననలు*
ఖమ్మం/అక్టోబర్ 02 : ప్రజా స్వామ్యానికి నాలుగో స్ధంభమైన  మీడియ రంగాన్ని పరిరక్షించాలని ,మీడియాకు భద్రత కల్పించి ,మీడియ కమీషన్ ను వేయాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) పిలుపు మేరకు దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా టియుడబ్ల్యుజె (ఐజెయు) ఆధ్వర్యంలో గాంధి జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి.  జిల్లాలోని అన్ని మండలాల్లో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలను చేపట్టి జాతీపిత మహత్మగాంధికి మొరపెట్టుకున్నారు.పలు చోట్ల మహత్మగాంధి తోపాటు ఆర్డీవోలకు,తహసిల్ధార్లకు మెమోరాండం సమర్పించారు.వైరా లో ఎంపి నామ నాగేశ్వర్ రావుకు వినతిపత్రాన్ని అందజేశారు.
జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో గాంధిచౌక్ లోని మహత్మగాంధి విగ్రహం వద్ద జర్నలిస్టులంతా నిరసన వ్యక్తం చేశారు.ప్లకార్డులను చేతబట్టి సెవ్ జర్నలిజం అంటూ నినాదాలు చేశారు. మీడియాతో పాటు మీడియా లో పనిచేసే వ్యక్తులకోసం భధ్రతా చట్టంను అమలు చేయాలని, విభిన్నమైన రంగాలకు చెందిన  ప్రముఖ వ్యక్తులతో మీడియా కమీషన్ వేయాలని,జర్నలిస్టుల రైల్వే పాస్ లను పున:రుద్దరించాలని,జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని,జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  ఈ సందర్బంగా టియుడబ్ల్యు జె (ఐజెయు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు మాట్లాడ్తూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్   జాతీయ కార్యనిర్వాహక కమిటీ  బీహార్ రాజధాని పాట్నాలో తీసుకున్న నిర్ణయం మేరకు  జాతీపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీని 'డిమాండ్స్ డే'గా పాటించాలని దేశవ్యాప్త పిలుపు ఇచ్చారని అందులోభాగంగా  ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.జాతీపిత గాంధిజి కూడా  ప్రముఖ పాత్రికేయుడు సంపాదకుడని నేటి పాలకులు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోకపోవడంతో ఆయనకే మొరపెట్టుకుంటున్నామన్నారు.బిజెపి పాలనలో మీడియాలో కార్పోరేట్ శక్తులు,విదేశి పెట్టుబడులను జోప్పించి మీడియాను తమగుప్పిట్లో పెట్టుకుంటుందని, నిజాలను వెలికితీసిన వారిని అవసరం అయితే హత్య కు కూడా వెనుకడలేదన్నారు.అందుకోసం మీడియా వ్యక్తుల కోసం భద్రతా చట్టం ను తీసుకరావాలని డిమాండ్ చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో  రాజకీయనేతలను తీసుకరావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీనియర్ పాత్రికేయులను,రిటైర్డ్ జడ్జీలతో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాను పరిరక్షించాలని కోరారు. ప్రింట్ ఎలక్ట్రానిక్  డిజిటల్ మీడియాలోకి వెళ్లడానికి భిన్నమైన రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు కాలగమనంలోఎలక్ట్రానిక్ మీడియా , తరువాత డిజిటల్ మీడియా ప్రవేశంతో మీడియా తీవ్ర మార్పులకు గురైందని    ఈ నేపధ్యంలో మీడియా  కమీషన్ లోకొత్త సంస్కరణలు తీసుకరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె  ఐజెయురాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యవర్గ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
*కాంగ్రెస్ పార్టీ సంఘీభావం*
 జర్నలిస్టులు చేసిన ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. నగర కమిటీ అధ్యక్షులు మమ్మద్ జావేద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు డి సౌజన్య తదితర నాయకులు జర్నలిస్టుల ఆందోళనకు మద్దతు తెలిపారు

No comments:

Post a Comment