కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి సమగ్ర చర్చ చేపడతామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, బాధ్యులపై చర్యలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ కమిషన్ చేసిన సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అసెంబ్లీలో చర్చించి, రాజకీయాలకు అతీతంగా పూర్తిగా చట్టబద్ధంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment