Thursday, 2 July 2026

*విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

*విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*
-------------------------------------------------------------------
*మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి*
-------------------------------------------------------------------
*కొణిజెర్ల మండలం పల్లిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్దులతో కలిసి మద్యాహ్న బోజనం చేసిన జిల్లా కలెక్టర్*
-------------------------------------------------------------------
ఖమ్మం, కొణిజర్ల, జూలై -02: ప్రభుత్వ విద్యా సంస్ధలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపెడతారనీ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.గురువారం వైరా నియోజకవర్గ పర్యటనలో భాగంగా కొణిజెర్ల మండలం పల్లిపాడు గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి, వంటగది నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ దివాకర టిఎస్ మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలకు వడ్డిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.భోజనం రుచిగా ఉందా, మెనూ ప్రకారం గుడ్డు, వెజిటబుల్ బిర్యానీ, పప్పు, సాంబారు అందిస్తున్నారా, ఆహారం పరిశుభ్రంగా తయారవుతోందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో కీలకమని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం వినియోగించాలని, ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేసి తాజా కూరగాయలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంచేందుకు తల్లిదండ్రులతో నిరంతరం సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజనం, మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ విద్యపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొణిజెర్ల తహసీల్దార్ అరుణ, వైరా మున్సిపల్ కమీషనర్ రామచందర్ రావు, ఎంఈవో చావా శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment