*కబ్జాదారుల గుప్పిట్లో 50 కోట్ల CMC(GHMC) బల్దియా భూమి!*
*శేరిలింగంపల్లి చందానగర్లో 4 వేల గజాల స్థలం ఆక్రమణ*
*అడ్డగోలుగా ప్రహరీ కూల్చి ఆక్రమించిన CMC అధికారుల మొద్దునిద్ర*
*బి ఆర్ ఎస్ ప్రభుత్యం హయాంలో మహిళా భవనం కు,ఫంక్షన్ హాల్ కోసం భూమి కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్యలో కబ్జాదారుల పాలు*
*కలెక్టర్ ఇచ్చిన అధికారిక పత్రంలు ఇచ్చిన చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న సీఎంసీ యంత్రాంగం*
*ప్రజాప్రతినిధి అండతో మున్సిపల్ అధికారుల తీరుపై మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ద్యాజం*
*తక్షణమే ఉన్నతాధికారులు స్పందించకపోతే మహిళలతో కలిసి న్యాయపోరాటం తప్పదని హెచ్చరిక*
*చందానగర్:*
మహిళమణుల అవసరాల కోసం కేటాయించిన సుమారు 50 కోట్ల విలువైన CMC భూమి కబ్జాదారుల పాలవుతున్నా మున్సిపల్ అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. కాపాడాల్సిన అధికారులే ప్రజాప్రతినిధి అండతో కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చందానగర్ డివిజన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ బాగోతం మున్సిపల్ అధికారుల అంతులేని నిర్లక్ష్యానికి, అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. సొంత భూమిని రక్షించుకోవడంలో విఫలమైన అధికారుల తీరుపై చందానగర్ మాజీ కార్పొరేటర్, న్యాయవాది బొబ్బ నవతారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్,డిప్యూటీ కమిషనర్ కు,గత 2 సంవత్సరాలుగా పిర్యాదు చేస్తున్న పట్టించుకోవడం లేదు అని ఉన్నతాధికారులకు ఈ రోజు ఆమె ఘాటైన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 210లో సుమారు 4 వేల గజాల స్థలం ఉంది. దీని బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుంది. ఈ స్థలంలో మహిళా భవనం, మోడల్ మార్కెట్, ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2018 (మార్చి 7న), 2019 (మే 5న) ప్రొసీడింగ్స్ (LC1/3076/2016) ద్వారా మున్సిపల్ కార్పొరేషన్కు కేటాయించారు. దీని ప్రకారం 2019లోనే కార్పొరేషన్ అధికారులు ఆ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించి, గేటు కూడా ఏర్పాటు చేశారు. అయితే, కబ్జాదారులు 2022 ఆగస్టు 10న, 2024 ఫిబ్రవరి 9న దౌర్జన్యంగా ఆ ప్రహరీని కూల్చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక మున్సిపల్ అధికారులు చోద్యం చూశారే తప్ప చర్యలు తీసుకోలేదు.
స్థలం ఆక్రమణకు గురవుతుండటంపై మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా.. అధికారులు అత్యంత బాధ్యతారాహిత్యంగా బదులిచ్చారు. అది మాది కాదు ప్రభుత్వ భూమి అని, దానికి సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్వయంగా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలను జతచేసి.. 2024లో అప్పటి డెప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. 2025 నవంబర్లో సైతం జోనల్ కమిషనర్కు మరోసారి వినతిపత్రం ఇచ్చారు. అయినా ఉన్నతాధికారుల్లో ఉలుకూ పలుకూ లేదు.మున్సిపల్ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకున్న కొందరు, అదే స్థలంలో టీజీఎస్పీడీసీఎల్ సబ్స్టేషన్ నిర్మాణానికి తెరతీశారు. దీనిపై నవతారెడ్డి ఆర్టీఐ ద్వారా విద్యుత్ శాఖను వివరణ కోరగా.. ఆ భూమికి సంబంధించి తమ వద్ద ఎలాంటి అధికారిక కేటాయింపు పత్రాలు లేవని,ప్రజాప్రతినిధుల సూచనతో నిర్మాణం చేశామని సమాధానమిచ్చారు. ఇదే విషయమై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీయగా.. తాము విద్యుత్ శాఖకు హెచ్ఎంసీ యాక్ట్ యూ బై ఎస్ 635 కింద నోటీసులు ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. కోట్లాది రూపాయల భూమిని ఆక్రమించి,ఎలాంటి అనుమతులు లేకుండా స్థలంలో పత్రాలు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే నోటీసులు ఇచ్చి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా జీహెచ్ఎంసీ/సీఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారు. రూ.50 కోట్ల ప్రజా ధనాన్ని కబ్జాదారులకు ధారాదత్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రొసీడింగ్స్ ప్రకారం తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని, మహిళా భవనం, ఫంక్షన్ హాల్ నిర్మించాలి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి తక్షణమే అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మున్సిపల్ అధికారుల తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున మహిళ పోరాటం, న్యాయ పోరాటం చేస్తామని బొబ్బ నవతారెడ్డి హెచ్చరించారు.
No comments:
Post a Comment