Wednesday, 15 July 2020

కరోనా కాలంలో జగనన్న పనితీరు భేష్ - శైలజా చరణ్ రెడ్డి


కరోనా కష్టకాలంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పనితీరు చాలా బేషుగ్గా ఉందని జాతీయ, అంతర్జాతీయ నాయకులు & మీడియా సైతం ప్రశంసిస్తున్నారు అని  ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు  యువ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి పాలనను  చూసి హర్షిస్తూ ఉంటే  చంద్రబాబు అండ్ టీం మాత్రం సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారని,  దానికి తోడు పీకే ప్యాకేజీ ఉంటే ఒకలాగా ప్యాకేజీ అందిన తర్వాత ఇంకొక లాగా మాట మార్చి మాట్లాడడం చూస్తుంటే ఆయన నిలకడలేని తత్వం అర్థమవుతుందని  వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజినల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జి శైలజా చరణ్ రెడ్డి మండిపడ్డారు.
*జగనన్న టార్చ్ బేరర్*
➡️  దేశం నలుమూలల నుండి వచ్చిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తీసుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా  జగనన్న  ఒక మానవత్వ హృదయoతో శ్రామిక రైళ్ల ద్వారా వేల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించడం జరిగింది అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా,వెనుకడుగు వేయకుండా వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడంలో ముందడుగు వేసిన మా నాయకుడు జగనన్న అని ఆమె తెలిపారు
➡️  వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్ లు ,
వారికి భోజన సదుపాయాలు, ఉండేందుకు అణువుగా షెల్టర్ కల్పించడం జరిగింది.
➡️  16 శ్రామిక రైళ్ల ద్వారా 21,229 వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించడం జరిగింది.
➡️  వివిధ రాష్ట్రాల్లో ఉన్న 16 వందల మంది విద్యార్థులను మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది.
➡️  అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ దేశాల్లో ఉన్న మన రాష్ట్రానికి సంబంధించిన వారిని వందేమాతరం-ప్రత్యేక విమానాల ద్వారా తీసుకువచ్చారు.
➡️  వివిధ రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులను, విదేశాలలో ఉన్న వారిని తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం తో పాటు, కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తూ  తన సమర్థతను చాటు ఉంటున్నాడని  40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే నాయకులకు సైతం  చెంపపెట్టు గా పాలన సాగిస్తున్నాడు అని శైలజా చరణ్ రెడ్డి తెలిపారు

No comments:

Post a Comment