Friday, 30 April 2021

లాక్ డౌన్ ఆలోచన లేదు..!! ప్రదాని మోదీ

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దేశంలోని కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, చర్యలపై చర్చిస్తున్నారు. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో వర్చుపల్ పద్దతిలో ఈ సమావేశం జరుగుతోంది.


ఈ సందర్భంగా *దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు.* కరోనా కేసుల ఆధారంగా లాక్‌డౌన్‌పై *ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని మోదీ తెలిపారు.* కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేయాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని మోదీ సూచించారు.

No comments:

Post a Comment