భక్తజన బాంధవుడు శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తాగ్రేశ్వరుడు కన్నప్ప ధ్వజారోహణంతో వేదోక్తంగా ప్రారంభమయ్యాయి.
తొలిరోజు పరమేశ్వరుని వరప్రసాదం అనుగుణంగా భక్తకన్నప్పకు తొలిపూజతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.భక్త కన్నప్ప ఉత్సవమూర్తికి విశేష దివ్య అలంకారాలు చేశారు.పులి చర్మ దారుడు అయిన భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని మేళతాళాలతో, భక్తుల శివ నామస్మరణల నడుమ కైలాస పర్వతంపై వెలసిన కైలాసనాధుని ఆలయానికి తీసుకువెళ్లారు.శివాలయం వద్ద ఉత్సవమూర్తిని కొలువు తీర్చి, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.నందీశ్వరుని ధ్వజ పతాకంతో కూడిన ధవళ వస్త్రంతో కూడిన ధ్వజ దారాన్ని భక్తులు శివనామస్మరణలు చేస్తుండగా,మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ ఓంకార,డమరుకనాదాలు, శంఖారావం నడుమ ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Powered by:
MANIKUMAR KOMMAMURU.
📲: 9032075966.
No comments:
Post a Comment