Wednesday, 10 June 2026

బసవతారకంలో చిన్నారుల మధ్య బాలకృష్ణ బర్త్ డే


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో 22 జూన్ న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ రజతోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నాం – శ్రీ నందమూరి బాలకృష్ణ

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకొన్న శ్రీ నందమూరి బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్,  రిసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం జూన్ 22 న సాయంత్రం హైటెక్ సిటీలోని నొవాటెల్ హోటల్ లో నిర్వహిస్తున్నామని శ్రీ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.  బుధవారం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్,  రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ చైర్మన్ హోదాలో నందమూరి బాలకృష్ణ కార్యక్రమాలను వివరించారు. 
 2000 వ సంవత్సరములో ప్రారంభమైన సంస్థ 25 సంవత్సరములు పూర్తి చేసుకొని ముందుకు సాగుతోందని ప్రస్థానాన్ని వివరించారు.  స్వర్గీయ నందమూరి తారకరామారావు, శ్రీమతి బసవతారకం ల‌ ఆశయాల మేరకు నడపడం జరుగుతోందని అంటూ గత సంవత్సర కాలంగా రజతోత్సవ వేళ పలు కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు.  
ఈ రజతోత్సవ కార్యక్రమాల ముగింపు ఈ నెల 22 న నిర్వహించబోయే భారీ కార్యక్రమంతో ముగుస్తుందని వివరించారు.  ఈ కార్యక్రమానికి శ్రీ జె పి నడ్డా,  కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులతో పాటూ శ్రీ వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి - శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు విశిష్ట అతిదులుగా హాజరుకానున్నారని తెలిపారు.  వీరితో పాటూ కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ, ఆంద్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ లు హాజరుకానున్నారని శ్రీ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.  
ఈ కార్యక్రమం ద్వారా 25 సంవత్సరముల గడిచిన కాలాన్ని అవలోకనం చేసుకొంటూ భవిష్యత్తులో హైదరాబాదు హాస్పిటల్ వద్ద నిర్మించనున్న సరికొత్త నార్త్ బ్లాక్ మరియు అమరావతిలోని తుళ్లూరు వద్ద నిర్మించనున్న హాస్పిటల్ ను అనుకొన్న గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు.  ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్మాణంతో పాటూ నడపడానికి గత 25 సంవత్సరములుగా సహకరించిన వారందరినీ గుర్తుకుతెచ్చుకొని వారి స్పూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.  లభాపేక్ష లేకుండా సంస్థ నిర్వహించడం జరుగుతోందని, భవిష్యత్తులోనూ ఇదే పంథాలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు.
 సమావేశానికి ముందుగా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలలో  నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య సంస్థ సిబ్బంది ఏర్పాటు చేసిన  కేక్ ను కట్ చేసి వారితో పంచుకొన్నారు.  అనంతరం చిన్నారులకు బొమ్మలు మరియు ఇతర బహుమతులు అందజేశారు.  అనంతరం హైదరాబాదుకు చెందిన  సీతారామారాజు హాస్పిటల్ కు అందించిన లక్షరూపాయాల విరాళాన్ని స్వీకరించారు.  తర్వాత త్రివేణి, కృష్ణవేణి స్కూల్లకు చెందిన విద్యార్థీ, విద్యార్థిణులు క్యాన్సర్ రోగుల సహాయార్థం సేకరించిన లక్షా వెయ్యి నూట పదహారు రూపాయాల విరాళాలాన్ని యాజమాన్యం, పిల్లలు కలసి నందమూరి బాలకృష్ణకు అందజేశారు.  పిమ్మట అమరావతిలోని తుళ్లూరు వద్ద నిర్మాణమవుతున్న నూతన హాస్పిటల్ నిర్మాణానికి  కాకర్ల రాఘవేంద్ర రావు అందించిన పది లక్షల రూపాయాల విరాళాన్ని చెక్కు రూపంలో స్వీకరించారు.  ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా చిన్నారులు చేస్తున్న మంచి పనిని ప్రశంసించారు.  పుట్టిన రోజులు శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తూ రానున్న రోజులలో మరింత ఉత్సాహంగా పని చేసేందుకు భగవంతుడు అవకాశమివ్వాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమాలలో  డా. టి సుబ్రహ్మణ్యేశ్వర రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణికోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాధ్, ఆసోసియేట్ డైరెక్టర్ – అకడమిక్స్, BIACH&RI మరియు పలువురు వైద్య విభాగాధిపతులు, వైద్యులు, నర్సింగ్ మరియు పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment