Thursday, 11 June 2026

సమాచార హక్కు వారదులు వీరే...

పోరాటంతో సాధించలేనిది ఏదీ లేదు అన్నది జగద్విదితం. ఈముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005, Right to Information Act
వీరిలో మధ్యలో ఉన్న ఆవిడే శ్రీమతి #అరుణారాయ్ IAS అధికారిణి..తన ఉద్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి Right to Information, Right to Work, Right to Food మొదలగు కార్యక్రమాల ద్వారా పేదల తరుపున తన గొంతు వినిపించడంలో ముందున్నారు. 
ఎడమవైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి #శంకరసింగ్. వీరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని తృణప్రాయంగా వదిలేసి ఆర్టీఐ కార్యకర్తగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.
కుడివైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి #నిఖిల్ #డే. వీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి గ్రామీణులకు స్వదేశంలో జరుగుచున్న అన్యాయాలపై నినందించాలని తపనతో విదేశీ విద్యకు స్వస్తిచెప్పి వచ్చిన వ్యక్తి. ఆర్టీఐ (RTI) ద్వారా ఎన్నో ప్రశ్నలు సంధించడమే కాకుండా,  ఎలా దానిని ఉపయోగించుకోవాలో ప్రజలకు శిక్షణ ఇస్తూ ఉంటారు.
ఈ ముగ్గురూ కలసి రాజస్థాన్ లోని దేవదుంగ్రి గ్రామంలో 1987 మేడే నాడు మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (Mazdoor Kisan Shakti Sangathan - MKSS) అనే సంస్థ ప్రారంభించి సాగించిన ఉద్యమ ఫలితమే సమాచార హక్కు చట్టం. 

No comments:

Post a Comment