Wednesday, 9 September 2020

తేనెపట్టుల కోసం ప్రయత్నంలో రథం దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా: అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటనలో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. తేనెపట్టుల కోసం కొందరు చేసిన ప్రయత్నం వికటించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు.

ఈ షెడ్‌లో ఒకవైపు తెరిచి ఉంచి ఆ భాగాన్ని తాటాకులతో కప్పి ఉంచారు  రథాన్ని ఒక షెడ్‌లో ఉంచగా ఈ రథానికి తేనెపట్టులు పట్టాయి గమనించిన కొందరు వ్యక్తులు తేనెపట్టులు తీసుకునే ప్రయత్నంలో. తేనెటీగలను చెదరగొట్టేందుకు 20 అడుగుల గెడ తెచ్చి దానికి, కాగడా కట్టేందుకు కొక్కెం కట్టారు. కాగడా సాయంతో తేనెటీగలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు  ఆ ప్రయత్నంలోనే కాగడా జారిపడి తాటాకులకు నిప్పు అంటుకుంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో పాటు తేనెతుట్టెలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు.

No comments:

Post a Comment