Monday, 24 February 2020

లంగ్ లీవ్ యు.ఎస్ - భారత్ ఫ్రెండ్షిప్... లంగ్ లీవ్ : నమస్తే ట్రంప్ కార్యక్రమంలో మోధి నినాదం.

అహ్మదాబాద్ మోతేరా స్టడియంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ - అమేరికాల  స్నేహ బంధం మధురమైనదని ఊటంకించారు. మిష్టర్ ప్రెసిడెంట్ మీరు 5వేల ఏళ్ల చారిత్రిక నౌక తీరం గల పట్టణంలో వున్నారంటూ ఆహ్మదాబాద్ నౌకశ్రయం చరిత్రను అమెరికన్లతో పాటు భారతజాతికి గుర్తు చేశారు.. . గత ఏడాది మేలో హౌడీమోడీ కార్యక్రమంలో అమెరికా రావడం సంతోషం కలిగిందంటూనే తమరు భారత్ రావడం మాకెంతో సంతోషం సుమండి అంటూ ట్రంప్ బృందాన్ని కాసిన్ని పొగడ్తలతో ముంచెత్తారు.ఆధ్యాతం జోష్ మొదలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో భాలతీయుల్లో ఉత్సహం నింపినప్పటికి..ప్రయాణ బడలిక వల్లనేమో అగ్ర రాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ లో  మాత్రం అమెరికా టూర్లలో ఉండే ఉత్సహం నేడు కాస్తా తగ్గిందనిపించింది..
ఆదివారం ఉదయం సకుటుంబ సపరివారంగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో భారత్ బయలుదేరిన ట్రంప్ దంపతులు, కుమార్తే,అలుడు ఇతర సిబ్బంది తో  ఆహ్మదాబాద్ చేరుకున్న వెంటనే శబర్మతి ఆశ్రమం చేరుకున్నారు అక్కడ గాంధీ చిత్ర పటానికి నూలుపోగు దండ వేసి నివాళి ఆర్పించారు.అనంతరం రాట్నం పై నూలు వడికే విధానం తెలుసుకుని రాట్నం తిప్పిరు. ఆశ్రమ సందర్శకుల పుస్తకంలో చేవ్రాలు రాసిన ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ చేడు వినకు..చూడకు..మాట్లాడకు అనే సందేశం ఇచ్ఛే మూడు కోతుల బొమ్మను చూపి దాని గురించి వివరించారు. అనంతరం అహ్మదాబాద్ నగరంలో నూతనంగా నిర్మాణం గావించిన అతి పెద్ద క్రికెట్ స్టేడియం లో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరయ్యారు..ఈ సందర్భంగా స్టేడియంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన ట్రంప్ అమేరికా ఇండియాల మధ్య ప్రేమ..అనుబంధం కలగలసిన.. స్నేహం వుందని ట్రంప్ అన్నారు.. ఇక్కడ బాలీవుడ్, క్రికేట్ క్రీడా ఎంతో గోప్పవని పోగడ్తలతో ముంచెత్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో వున్న నిర్మూలిద్దాం అంటూ ఇటీవల అల్ బాగ్దాదిని మట్టు పెట్టిన విషయం గుర్తు చేశారు.. ఉగ్రవాద నిర్ములనలో అమెరికా ఎప్పుడూ భారత్ కు అండగా వుంటుందన్నారు. ఛాయ్ వాలా గా జీవితం ప్రారంభించిన మోధి ప్రధాని కావడం అంటే అషామాషీ కాదన్నారు.. త్వరలోనే భారత్ తో వాణిజ్య ఒప్పందాలు ఉండబోతున్నాయంటూ సంకేతాలు ఇచ్ఛారు.. ఈ సందర్భంగా మోధి అమెరికా - భారత్ సంబంధాలు మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్ష వ్వక్తం చేశారు. మీరు కుటుంబ సపరివారంగా రావడం మాకు ఎంతో  ఆనందం కలిగించే విషయం. అమెరికా నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి భారత గడ్డపై అడుపెట్టిన వెంటనే విశ్రాంతి తీసుకోకుండా నేరుగా శబర్మతి ఆశ్రమం సందర్శించి ఆ వెంటనే మోతేరా స్టేడియంలో అడుగు పెట్టారు. ఈ విషయం యావత్ భారతదేశం గుర్తుంచుకుంటుంది. మన స్నేహం చిరస్థాయిగా నిలిచి పోతుంది.లంగ్ లీవ్ ఫ్రేండ్ షిప్ అంటూ స్టేడియంలో వారితో నినదింపజేశారు.

No comments:

Post a Comment