Friday, 23 January 2026

మేడరం జంపన్న వాగులో.భక్తుల అత్యుత్సాహం... కాపాడిన ఎన్డీఆర్ఎఫ్...


మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా నీటిలో మునిగిపోతున్న ముగ్గురు భక్తులను ఎస్‌డీఆర్ఎఫ్ 5వ బెటాలియన్, ములుగు సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి (36), ఇద్దరు బాలికలు (14, 13) సురక్షితం.  విధుల్లో ఉన్న ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
రక్షించబడిన వారి కుటుంబ సభ్యులు ఎస్‌డీఆర్ఎఫ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 5వ బెటాలియన్ కమాండెంట్ కె. సుబ్రహ్మణ్యం సిబ్బందిని అభినందిస్తూ,మేడారం జాతరలో భక్తుల ప్రాణభద్రతకు ఎస్‌డీఆర్ఎఫ్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తుందని తెలిపారు.
భక్తులకు సూచన : జంపన్న వాగు వద్ద అత్యంత జాగ్రత్తలు పాటించాలి. లోతైన నీటిలోకి వెళ్లకుండా, అధికారుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలి.
_____________________________________________

బాసరలో వసంత పంచమి: జ్ఞాన సరస్వతీ దేవికి పట్టువస్త్రాలు సమర్పించిన ప్రధాన కార్యదర్శి

_____________________________________________

 వసంత పంచమి శుభ సందర్భంగా శ్రీమతి.  బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేక పూజలు చేసి తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

200 కోట్ల రూపాయలతో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించి, బాసర ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను ఆమె పునరుద్ఘాటించారు.  రాబోయే గోదావరి పుష్కరాల కోసం సమగ్ర ఏర్పాట్లు చేస్తామని, భక్తులకు దర్శనం సజావుగా ఉండేలా, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
------------------------------------------------------------------------
@ మణికుమార్ కొమ్మమూరు 
మోబైల్ : 9032075966.
------------------------------------------------------------------------

No comments:

Post a Comment